Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఓటేసి గెలిపిస్తే రైతన్నలకు ప్రతి నెల ఎకరానికి 3 వేల ప్రోత్సాహకం – సాత్విక రెడ్డి

Must read

తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్ : విద్యార్థుల రాజకీయ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థి సాత్విక రెడ్డి చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అమె మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీఫామ్ ఇచ్చిన పార్టీ వ్యవస్థాపకులు యొచ్చు సునీల్ కి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి అశేష స్పందన లభిస్తుందన్నారు. అటు రాష్ట్రంలో, ఇటు నియోజకవర్గంలో బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే రైతన్నలకు ప్రతి నెల ఎకరానికి 3 వేల ప్రోత్సాహకం, 2.60 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రతి మహిళకు ఉపాధి కల్పన వంటి అనేక హామీలను నెరవేరుస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో పాక నవీన్ బాబు, ఇంజగిరి కమలాకర్, మడుపతి రాజు, మహిళా నాయకురాలు మిత్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you