Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మేడ్చల్‌.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయ్యినట్టే!

Must read

తెలంగాణ వీణ , మేడ్చల్ : ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్‌ నియోజకవర్గం ఎంతో మంది ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మర్రి చెన్నారెడ్డి, దేవేందర్‌గౌడ్‌ వంటి రాజకీయ ప్రముఖులకు రాజకీయంలో నిలదొక్కుకునేలా మేడ్చల్‌ నిలిచింది. పునరి్వభజనకు ముందు మేడ్చల్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రాష్ట్రంలో మంత్రి పదవులు పొందినవారే. పునరి్వభజనకు ముందు జీహెచ్‌ఎంసీతో కలిసి ఉండే నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఖైరతాబాద్‌ తర్వాత అతి పెద్దదిగా మేడ్చల్‌ ఉండేది. మేడ్చల్, కూకట్‌పల్లి(కొంతభాగం) కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్‌బీనగర్‌(కొంతభాగం) నియోజకవర్గాలు కలిపి మేడ్చల్‌ నియోజకవర్గంగా ఉండేది. పునరి్వభజన తర్వాత మూడు ముక్కలైంది.  

1962లో ఏర్పడ్డ మేడ్చల్‌ నియోజకవర్గం మొదటి ఎన్నికల్లో స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రాంచందర్‌రావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాటి కాంగ్రెస్‌ యోధుడు కేవీ రంగారెడ్డిపై విజయం సాధించారు.  

 1967 నుంచి 72 వరకు ఎస్సీ రిజర్వ్‌డ్‌ కావడంతో కాంగ్రెస్‌ అగ్రనేత సుమిత్రాదేవి రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.  

1978లో మర్రి చెన్నారెడ్డి మేడ్చల్‌ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1983లో దివంగత తెలంగాణ పోరాట యోధుడు గౌడవెల్లికి చెందిన సింగిరెడ్డి వెంకట్రాంరెడ్డి సతీమణి ఉమాదేవి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఎనీ్టఆర్‌ హవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.   1983లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములకు చెందిన కొమ్మురెడ్డి సురేందర్‌రెడ్డి టీడీపీ నుంచి బరిలో నిలబడి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎనీ్టఆర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 

మేడ్చల్‌ ఓటర్లు ఏనాడూ స్థానిక స్థానికేతర భేదం లేకుండా అందరినీ రాజకీయంగా ఆదరించారు. మేడ్చల్‌ నుంచి 12 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఉమాదేవి, సురేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిలు మాత్రమే నియోజకవర్గానికి చెందిన వారు కాగా మిగతా వారు నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నేతలే. ఇలా మేడ్చల్‌ రాష్ట్రానికి ఉద్దండ నాయకులను అందించడంతో పాటు చాలామంది నాయకులకు రాజకీయ భవిష్యత్‌ను అందించింది. ఆరుసార్లు ఓడిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని మొదటిసారి చట్టసభలకు పంపిన ఘనత మేడ్చల్‌ ఓటర్లదే.. పోటీలో తొలిసారి నిలిచిన దేవేందర్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, సు«దీర్‌రెడ్డి, ఉమాదేవి, మల్లారెడ్డి వంటి నాయకులకు రాజకీయ భవిష్యత్‌ను కల్పించిన ఘనత మేడ్చల్‌ ఓటర్లదే..  

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you