Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కేసీఆర్ సెంటిమెంట్…అసెంబ్లీ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని తలపెట్టారు. ఈరోజు నుంచి 3 రోజుల పాటు యాగం కొనసాగనుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటల బ్రహ్మ ముహూర్తంలో యాగం ప్రారంభమయింది. 200 మంది వైదికులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. ఈరోజు రాజశ్యామల అమ్మవారు, చండీ అమ్మవార్లతో పాటు ఐదుగురిని ఆవాహనం చేసుకుని హోమం నిర్వహించనున్నారు. రెండో రోజు వేద పారాయణాలు ఉంటాయి. చివరి రోజున పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. మరోవైపు ఈ యాగాన్ని నిర్వహించిన ప్రతిసారి ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధిస్తూనే వస్తున్నారు. ఇదే సెంటిమెంటుతో ఇప్పుడు కూడా యాగాన్ని తలపెట్టారు. ఆయన ఫామ్ హౌస్ లో ఈ యాగం జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ యాగం జరుగుతుంది. గోపూజ అనంతరం కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేసారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగింది. కేసీఆర్‌ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి యాగంలో ఆసీనులయ్యారు.

గురు ఆజ్ఞ తీసుకుని యాగాన్ని ప్రారంభించారు. కేసీఆర్‌ దంపతులతో స్వరూపానందేంద్ర స్వామి యాగ సంకల్పం చెప్పించారు. విశాఖ శ్రీ శారదాపీఠ అధిష్టాన దైవం రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు.

యాగంలో పాల్గొనే పండితులు, రుత్విక్కులకు కేసీఆర్‌ దంపతులు దీక్షా వస్త్రాలను స్వయంగా అందించారు. అఖండ స్థాపన అనంతరం అగ్నిమధనం చేసి యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు. తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని తలపెట్టారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. రాజశ్యామల యాగం విశాఖ శ్రీ శారదాపీఠానికి ప్రత్యేకమని స్పష్టం చేసారు.

యాగంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you