Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 ఈసారి గెలిపిస్తే మీ ఇళ్లే కొట్టేస్తారు… ఎవరిని గెలిపిస్తారో తేల్చుకోండి

Must read

తెలంగాణ వీణ , కరీంనగర్ : గంగుల కమలాకర్‌కు ఎమ్మెల్యేగా మూడుసార్లు అవకాశమిస్తే భూములు కొల్లగొట్టాడని, గుట్టలను మాయం చేశాడని, పొరపాటున మళ్లీ గెలిపిస్తే ఈసారి మీ ఇళ్లను కూడా కొట్టేయడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అబద్ధాలు చెప్పడంలో గంగులను మించినోడు లేడని, అందుకే తనను అవినీతిపరుడు అంటున్నాడని మండిపడ్డారు. తాను అధికారంలోనే లేను… అవినీతికి ఎలా పాల్పడతాను? అని ప్రశ్నించారు. ఒకవేళ అవినీతికి పాల్పడినట్లయితే… తనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని నిలదీశారు. తనపై ఆరోపణలు చేశాడని, కాబట్టి తన ఆస్తులకు సంబంధించిన డాకుమెంట్లు అన్నింటినీ గంగుల తీసుకు రావాలని… అప్పుడు ఆ ఆస్తులన్నింటిని ప్రజలకే ఇచ్చేస్తానన్నారు.

గంగుల కమలాకర్ రెడ్డి కూడబెట్టిన ఆస్తుల డాక్యుమెంట్లను కూడా తీసుకువస్తే, అవి కూడా ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్ గురించే తెలియదని, రేషన్ కార్డులు, పెన్షన్లు ఎలా ఇస్తారు? అనే విషయం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. భూకబ్జాలు చేయడం తప్ప, ప్రజల కోసం కొట్లాడింది లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్… ఇద్దరు అభ్యర్థులది భూకబ్జాల పంచాయతీయేనని ఆరోపించారు. పేదల కోసం ఎంతకైనా తెగించే నైజం తనదని, కాబట్టి ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you