Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

అద్రాస్ పల్లి లో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం..

Must read

తెలంగాణ వీణ, శామీర్ పేట్: గ్రామస్తాయి నుండి పార్టీని బలోపేతం చేయాల్సిన భాద్యత కార్యకర్తలదే నని బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం అద్రాస్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తుకెళ్ళాలన్నారు. మంత్రి మల్లారెడ్డి స్వంత నిధులతో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించి అవగాహనా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్, సర్పంచ్ లలిత నర్సింలు, ఉపసర్పంచ్ జహంగీర్, గ్రామ అధ్యక్షుడు భూపాల్, మల్లేష్, నాయకులు నగేష్ చారీ, రమేష్, చిరంజీవి, బాబు, వార్డ్ సభ్యులు రాజు, నాగరాజు, మణెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you