Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి కాపు కులాల సంపూర్ణ మద్థతు

Must read

తెలంగాణవీణ, ఉప్ఫల్ : ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి కాపు కులాల ఐక్యవేదిక సంపూర్ణ మద్థతు ప్రకటించింది. ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ కాపు సంఘ భవనంలో అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు కులాల ఐక్యవేదిక సమావేశానికి బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో 40వేల ఓటర్లు ఉన్న కాపులు, తమ సామాజిక వర్గానికి ఒక ఫంక్షన్ హాలు ఏర్పాటు చెయ్యాలని, రాజకీయంగా తమకు ప్రాధాన్యత కల్పించాలని, వంగవీటి మోహనరంగా రావు స్ఫూర్తితో బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
తనకు సంపూర్ణ మద్దతిచ్చిన కాపులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, కెసిఆర్ కాపుల కమ్యూనిటీ హాల్ కోసం హైటెక్ సిటీలో 7ఎకరాల స్థలాన్ని కేటాయించారని గుర్తుచేశారు. కాపులకు రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుందని హామీనిచ్చారు. నియోజకవర్గ అభివద్ధి కొరకు సీఎం కేసీఆర్ గారితో మాట్లాడి 40 కోట్ల నిధులు మంజూరు చేపించానని, ఉప్పల్ నియోజకవర్గానికి 100పడకల ఆసుపత్రి తీసుకొచ్చానన్నారు. ఈ సమావేశంలో సోమశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ దాసరి ప్రసాద్, కోశాధికారి వి.నాగు మాజీ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు , కాపు కులాల పెద్దలు, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పి.పావని రెడ్డి, గొల్లూరి అంజయ్య, మరియు ఏ.వి.ఆర్ దత్తు, శంకర్ బాబు, నానాజీ, రామ్మోహన్, సత్యనారాయణ, శ్రీనివాస్, లక్ష్మీకాంతయ్య, నాగన్న, మధుసూదన్, లక్ష్మీనారాయణ, మురళి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you