Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తెలంగాణ ప్రకటన వస్తే భోజనం మానేసిన పవన్ కల్యాణ్‌తో బీజేపీ కలిసింది

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ప్రకటన చేస్తే తాను భోజనం మానేశానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ ఇక్కడ జత కలుస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. శుక్రవారం సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్‌తో బీజేపీ, షర్మిలతో కాంగ్రెస్ జట్టు కట్టాయని అన్నారు. పవన్, షర్మిల… ఇద్దరూ తెలంగాణ ద్రోహులు అని ఆరోపించారు. ఆ రోజు తెలంగాణ ప్రకటిస్తే భోజనం మానేశానని చెప్పిన జనసేనానితో బీజేపీ ఎలా కలుస్తుందన్నారు.

అలాగే, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల అని, ఆమె కాంగ్రెస్ వైపు ఉందన్నారు. తెలంగాణ ఇవ్వమని కొట్లాడితే ఇవ్వడానికి అది సిగరెట్టా..? బీడియా…? అని వైఎస్ ఆనాడు అన్నాడని గుర్తు చేశారు. తాను బతికుండగా తెలంగాణ రాదన్నారని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కూతురు షర్మిల ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిస్తోందన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you