Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

టీడీపీ ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై అఖిలపక్ష సమావేశం…

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రౌండ్ టేబుల్ సమావేశం ఇన్చార్జి బుద్ధా వెంకన్న, టీడీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, సీపీఐ రామకృష్ణ, జనసేన నేత పోతిన మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

అచ్చెన్నాయుడు: నా ఎస్సీలు, నా బీసీలు అంటున్న జగన్ ఏంచేశారు? దళితులు, బీసీలసై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? దాడులపై ఏ ఒక్క బీసీ మంత్రి అయినా స్పందించారా? రాష్ట్రాన్ని ఐదుగురు వ్యక్తులకు ధారాదత్తం చేశారు.

బుద్ధా వెంకన్న: జగన్ ప్రభుత్వం బీసీలను చూసి ఓర్వలేకపోతోంది. ఇవాళ్టి కార్యక్రమంలో అచ్చెన్నాయుడికి గద బహూకరించాం. ఎందుకంటే… చంద్రబాబు చేస్తున్న పోరాటానికి హనుమంతుడిలా వెంట ఉండి సాయపడుతున్నాడు. ఉత్తరాంధ్ర నుంచి ఇటు చిత్తూరు వరకు వైసీపీ శ్రేణులను తరిమి తరిమి కొడతాడని ఆయనకు గద ఇచ్చాం.

కొల్లు రవీంద్ర: బీసీలను మోసగించేందుకే వైసీపీ సామాజిక బస్సు యాత్ర చేపడుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బీసీలు బుద్ధి చెబుతారు. 


 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you