Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఉదయం నుంచి సాయంత్రం వరకు 800 భూ ప్రకంపనలు…

Must read

తెలంగాణ వీణ , జాతీయం : అతి శీతల వాతావరణం నెలకొని ఉండే దేశంగా పేరుగాంచిన ఐస్ లాండ్ ఇప్పుడు వందల సంఖ్యలో భూ ప్రకంపనలతో హడలిపోతోంది. శుక్రవారం వేకువజాము నుంచి సాయంత్రం వరకు 800 సార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రకంపనలన్నీ ఒక్క రెక్ జానెస్ ప్రాంతంలోనే సంభవించాయి. 

ఐస్ లాండ్ లో ప్రస్తుతం ఎమర్జెన్సీ ప్రకటించారు. ముఖ్యంగా, గ్రిండ్ విక్ ప్రాంతంలో భూ ప్రకంపనల వల్ల ఓ భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందే అవకాశాలు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. దాంతో గ్రిండ్ విక్ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. 

ఐస్ లాండ్ రాజధాని నగరం రెక్ జావిక్ కు కొద్ది దూరంలో 5.2 తీవ్రతతో రెండు ప్రకంపనలు రాగా, రహదారులు ధ్వంసం అయ్యాయి. దాంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, రెక్ జానెస్ ప్రాంతంలో అక్టోబరు నెలాఖరు నుంచి ఇప్పటివరకు 24 వేల ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you