Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

నేడు అమిత్‌షాతో ముఖ్యమంత్రి భేటీ

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి ఆ­­యన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, పశ్చి­మ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు/హోంశాఖ మంత్రులు /అధికారులు హాజరు కానున్నారు.

అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నారు. కాగా, రెండు రోజుల పర్య­టన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, మార్గాని భరత్‌రామ్, బాలశౌరి, గో­రంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎన్‌.రెడ్డప్ప­లు సీఎంకు స్వాగతం పలికారు. ఎంపీ మిథున్‌రెడ్డి ముఖ్యమంత్రి వెంట ఢిల్లీకి వచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you