Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కొడుకును సీఎం చేయడంపైనే ధ్యాస

Must read


తెలంగాణ వీణ , హైదరాబాద్ :
తన కొడుకును సీఎం చేయడం తప్ప తెలంగాణ ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా సీఎం కేసీఆర్‌ తీరుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవసాయం బాగుపడాలంటే సాగునీరు రావాలని, తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శనివారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ అధ్వర్యంలో నిర్వహించిన రైతుసదస్సులో కిషన్‌రెడ్డి మాట్లా డారు.

కేసీఆర్‌ సీఎం అయ్యాక ప్రాణహిత చేవెళ్లను రీడిజైనింగ్‌ పేరుతో రూ.30 వేల కోట్ల బడ్జెట్‌ను రూ.లక్షా 50 వేల కోట్లకు తీసుకెళ్లారని మండిపడ్డా రు. అయినా ఆ ప్రాజెక్టుకు ఫీజబిలిటి లేదని, కరెంట్‌ బిల్లులు కట్టలేని పరిస్థితి ఉందన్నారు. రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదనలతో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ.57 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ఒక్క పంపు హౌజ్‌ను ప్రారంభించి ఎన్నికల ముందు పాలమూరుకు మొత్తం నీళ్లు ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారన్నారు.

నాటి ఏపీ సీఎం చంద్రబాబుకు అమ్ముడుపోయి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్‌ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు టెండర్ల పేరుతో సీఎంవో రూ. 500 కోట్లు దండుకుని ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. కేసీఆర్‌ నిర్వాకంవల్ల రూ.40 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన పౌరసరఫరాల సంస్థను నిండా ముంచేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ‘కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటు కాకూడదు.. ప్రజలకు మేలు జరగకూడదన్నదే కేసీఆర్‌ ఆలోచన. థ్యాంక్స్‌ చెబితే నీకేమైతుంది? ముత్యాలేమైనా రాలతాయా?’అని అన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you