Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మహాప్రస్థానం లో తనికెళ్ళ భరణి

Must read

తెలంగాణ వీణ, సినిమా : పట్టణప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్న వేల మహ ప్రస్థానం లో కొలువైన పరమశివుడి చెంత చిత్తం లో మునిగిపోయారు సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి. సూర్యాపేట లో రాత్రి సాహిత్య సభ కు హాజరైన భరణి, అక్కడ కవుల ప్రసంగం లో మహప్రస్థానం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వెంటనే సందర్శించాలని నిర్ణయించుకున్న తనికెళ్ళ, తన మనసులోని కోరికను సభకు ముఖ్య అతిథిగా హాజరైన జగదీష్ రెడ్డికి తెలిపారు. ఆయనఅడిగిందే తడవుగా అర్ధరాత్రి 1:30గంటలకు తనికెళ్ల భరణి ను మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా మహాప్రస్థానం వద్దకు తీసుకెళ్లారు. వాహనం దిగుతూనే ప్రస్థానంలో కొలువై ఉన్న పరమశివుడి విగ్రహాన్ని చూసి పరవశించిపోయారు. సుమారు గంట సేపు శివ చిత్తం లో మునిగితేలారు. స్మశాన వాటిక నలుమూలల కలియ తిరుగుతూ మహా అద్భుతం అంటూ జాషువా పద్యాన్ని నెమరవెసుకున్నారు.
ఇచ్చోట నేసత్కవీంద్రుని కమ్మని
కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె
యిచ్చోట నేభూములేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె
యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు గంగలోఁ గలసిపోయె
అంటూ ఇంతటి అద్భుత మహాప్రస్థానాన్ని 20 ఏళ్ల క్రితం యూరప్ లో చూశాను అన్న తనికెళ్ళ, అక్కడ సైతం స్మశానం ఇరుకుగా ఉందన్నారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా సూర్యాపేటలోనే అంతటి నిర్మాణాన్ని చూస్తున్నానని తెలిపారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సువిశాలంగా, అహ్లాదకరంగా రూపుదిద్దుకున్న మహాప్రస్థాన దర్శనభాగ్యం ఇచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి తో ధన్యోస్మి అంటూ ఆనందబాష్పాలతో వెనుదిరిగారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you