Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ

Must read

తెలంగాణ వీణ , జాతీయం : భారతీయ జనతా పార్టీ రాజకీయాలను నానాటికీ దిగజార్చుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. బీజేపీ తన ఎక్స్ హ్యాండిల్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫొటోను మార్ఫింగ్ చేసి రావణుడిలా మార్చింది. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రియాంక ఎక్స్ లో “ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజకీయాలను దిగజార్చుతున్నారు. హింసాత్మక ఫొటోలతో గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. మీరు నిజాయతీగా, విలువలతో కూడి ఉంటామని ప్రమాణం చేశారు. ఇదేనా మీ నిజాయతీ, విలువలు?” అని ప్రశ్నించారు

దీంతో కాంగ్రెస్‌, బీజేపీ నడుమ ఎక్స్ లో పోస్టర్‌ వార్‌ జరుగుతోంది. ప్రధాని మోదీని.. జుమ్లాబాయ్‌, అతిపెద్ద అబద్ధాల కోరుగా అభివర్ణిస్తూ కాంగ్రెస్‌ పార్టీ తొలుత ఎక్స్ లో వ్యంగ్య పోస్టర్లు పెడితే.. 24 గంటలు కూడా తిరక్కముందే రాహుల్‌ను రావణుడిగా అభివర్ణిస్తూ బీజేపీ కాంగ్రెస్ కు దీటుగా సమాధానమిచ్చింది. తొలుత కాంగ్రెస్‌ పార్టీ బుధవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ‘‘పీఎం నరేంద్ర మోదీ యాజ్‌.. జుమ్లా బాయ్‌’’ అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో మోదీతోపాటు అమిత్‌షా(Amith Shah) ఫొటోనూ పెట్టింది. ఆ చిత్రాన్ని బీజేపీ సమర్పిస్తోందని ఎద్దేవా చేసింది. దీంతో, పాటు మోదీని ఎద్దేవా చేస్తూ పలు పోస్టులు చేసింది. దీనికి ప్రతిగా.. రాహుల్‌ను రావణుడుగా పేర్కొంటూ బీజేపీ తన ఎక్స్ ఖాతాలో గురువారం సాయంత్రం ఒక పోస్టు పెట్టింది. ఏదో హాలీవుడ్‌ సినిమాలో కవచం ధరించిన పాత్రధారికి రాహుల్‌ పదిముఖాలను అమర్చి తయారుచేసిన ఆ పోస్టర్‌పై భాగంలో.. ‘భారతదేశం ప్రమాదంలో ఉంది’ అని అర్థం వచ్చే హిందీ వాక్యం ఉంది. కింది భాగంలో.. ‘‘రావణ్‌.. జార్జ్‌ సోరోస్‌ దర్శకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రొడక్షన్‌’’ అని ఉంది. బీజేపీ తన ఎక్స్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్‌ చేసి.. ‘‘కొత్త తరం రావణుడు ఇక్కడున్నాడు. అతడు దైవ వ్యతిరేకి. ధర్మ వ్యతిరేకి, రామ వ్యతిరేకి. భారత్‌ను ధ్వంసం చేయడమే అతడి లక్ష్యం’’ అని పోస్ట్ చేసింది. బీజేపీ ఈ ఫొటోలో పేర్కొన్న జార్జ్‌ సోరోస్‌.. హంగరీ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యాపారవేత్త, అపరకుబేరుడు. మోదీపై తరచూ విమర్శలు చేస్తుంటారు. దీంతో.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై సోరోస్‌ దాడి చేస్తున్నారని బీజేపీ తరచూ తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సోరో్‌సకు, రాహుల్‌కు లింకు పెడుతూ పోస్టర్‌ ఉంచింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you