తెలంగాణ వీణ , జాతీయం : కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్రం చాలీచాలని మొత్తం కేటాయించిందని, అవి పూర్తి చేయడానికి అప్పులు చేయాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. పీఎంఏవై-జి పథకం లబ్ధిదారుల్లో 80 శాతం తమ గృహాల నిర్మాణానికి 1.50 లక్షల రూపాయలకు పైగానే వెచ్చించారు.
ఈ పథకం కింద మైదాన ప్రాంతం వారికి రూ.1.20 లక్షలు, పర్వత ప్రాంతాల వారికి రూ.1.30 లక్షలే కేటాయించారు.
దేశవ్యాప్తంగా 15 వేల మంది లబ్ధిదారులను ప్రశ్నించిన వీరు తమ సర్వే వివరాలను వెల్లడించారు. 2022 లో మూడు దశల్లో ఈ సర్వే జరిపామని చెప్పారు. అలాగే పీఎంఏవై-జీ గురించి వివరించే వెబ్ ఆధారిత వేదిక ఆవాజ్ సాఫ్ట్లో పేర్కొన్న విషయాలు చాలావరకు వాస్తవదూరంగా ఉన్నాయని పేర్కొంది.