Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

అభివృద్ధి కొన‌సాగాలంటే కేసీఆర్ గెలిపించాలి 

Must read

 తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాష్ట్రంలో అభివృద్ధి కొన‌సాగాలంటే కేసీఆర్‌ను మ‌రోసారి గెలిపించాల‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ కోరారు. కేసీఆర్ పాల‌న‌లో శాంతి భ‌ద్ర‌త‌లు భేషుగ్గా ఉన్నాయ‌న్నారు. శాంతి భ‌ద్ర‌త‌లు ఉన్న‌చోటే అభివృద్ధి బాగా జ‌రుగుతుంద‌న్నారు. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ క్షేమంగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. అభివృద్ధి.. ఆహ్లాదం.. ఆధ్యాత్మికానికి మారుపేరు కరీంనగర్.. మీ ఆకాంక్ష మేరకు అభివృద్ధి చేశాను. ఇంకా చేయాల్సి ఉందన్నారు. సమస్యలు చూసి పారిపోలేదు… పోరాటం చేశానని తెలిపారు. మరోసారి అవకాశం ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో నాలుగోసారి బ‌రిలో దిగుతున్నాను.. త‌న‌ను ఆశీర్వ‌దించండి అని గంగుల క‌మ‌లాక‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. క‌రీంన‌గ‌ర్‌లో గంగుల క‌మ‌లాక‌ర్ మీడియాతో మాట్లాడారు.

చారిత్రక నగరం కరీంనగరం.. ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ అని మంత్రి గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం సింహగర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుంచే అని తెలిపారు. ఎన్నో ఉద్య‌మాల‌కు, పోరాటాల‌కు వేదిక‌గా నిలిచిన ఘ‌న‌త క‌రీంన‌గ‌ర్‌ది అని పేర్కొన్నారు. త‌న‌ను మూడు సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు.. సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ ప‌దేండ్ల కాలంలో న‌గ‌రాన్ని గొప్ప‌గా అభివృద్ధి చేశామ‌ని చెప్పారు. క‌రీంన‌గ‌ర్‌లో మ‌ట్టి రోడ్డు లేకుండా చేశామ‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you