Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

జీవ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌విత‌

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాల‌ని క‌విత సూచించారు. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు.. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాని లెక్క నేను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నాను అని క‌విత వ్యాఖ్యానించారు. జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డిని తప్పకుండా తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదు… ఆయన పేపర్ టైగర్ అని క‌విత‌ మండిపడ్డారు.

మెట్‌ప‌ల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. నెహ్రూ కాలం నుంచి వాళ్ల కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, తెలంగాణతో రాహుల్ గాంధీ కుటుంబానికి నమ్మకద్రోహపు అనుబంధం ఉన్నదని మండిపడ్డారు. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన‌ 369 మందిని తుపాకులతో కాల్చి చంపించిన చ‌రిత్ర కాంగ్రెస్‌ది అని క‌విత‌ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న అంజయ్యను రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ అవమానించారని చెప్పారు. సీఎం కేసీఆర్ చావు నోట్లో తల పెడితే 2009లో తెలంగాణ ఏర్పాటును ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకుంటే వందలాదిమంది బిడ్డల చావులకు సోనియాగాంధీ కారణమయ్యారని అన్నారు. ప్రజా పోరాటాలతోనే 2014లో తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు.

స్క్రిప్టు రైట‌ర్‌ను మార్చుకోవాల‌ని రాహుల్‌కు సూచ‌న‌..
దొరలు, ప్రజలు అంటూ రాహుల్ గాంధీ ఏమో మాట్లాడారని, అయితే మంథనిలో దొర అయిన శ్రీధర్ బాబును పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని క‌విత‌ విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు దళిత బిడ్డ కవ్వంపల్లి సత్యనారాయణకు మాట్లాడే అవకాశం ఉండదు. కానీ శ్రీధర్ బాబు మాత్రం మాట్లాడుతార‌ని, రాహుల్ ప్రసంగాన్ని తర్జుమా చేయడానికి దళిత బిడ్డ అడ్డలూరి లక్ష్మణ్‌ను కాకుండా జీవన్ రెడ్డికి ఎలా అవకాశం ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ అని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని స్పష్టం చేశారు. స్క్రిప్టు రైటర్ ని మార్చుకోవాలని రాహుల్ గాంధీకి క‌విత సూచించారు.

నిజాం షుగ‌ర్ ఫ్యాక్ట‌రీని ముంచిందే కాంగ్రెస్ పార్టీ..
నిజాం షుగర్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి అంటున్నారని, ఈ వ్యాఖ్యలు చూస్తే జీవన్ రెడ్డికి సీనియారిటీ ఉంది కానీ సిన్సియారిటీ లేదన్నది అర్థమవుతోందని క‌విత విమర్శించారు. 1937లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నిజాం ప్రభువులు షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని, అందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నష్టాల ఊబిలో మునిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ధ్వజమెత్తారు. 2002లో ఆ ఫ్యాక్టరీనీ తెలుగుదేశం పార్టీ అమ్మేసిందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ చోద్యం చూసిందని అన్నారు. ఆ ఫ్యాక్టరీని కొన్న వ్యక్తి బీజేపీ మాజీ ఎంపీ అని, ఫ్యాక్టరీ ఆస్తులను తాకట్టు పెట్టి ఆ బీజేపీ నాయకుడు 150 కోట్ల రూపాయల మేర అప్పులు తీసుకున్నారని తెలిపారు. రైతులకు, కార్మికులకు ఆ ప్రైవేట్ యాజమాన్యం బకాయిలు ఎగ్గొట్టిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 66 కోట్లు చెల్లించిందని, ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి 2015 లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, దాంతో చెప్పా పెట్టకుండా ఆ బీజేపీ నాయకుడు లాకౌట్ ప్రకటించారని వివరించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడేది సీఎం కేసీఆర్ మాత్రమేనని, మిగతా వాళ్ళు కల్లిబొల్లి మాటలు చెబుతారని మండిపడ్డారు. న్యాయ సమస్యలు పుట్టించింది ఆ బీజేపీ నాయ‌కుడే అని క‌విత మండిప‌డ్డారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you