Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 ఝల్రాపటన్‌ నుంచి వసుంధర

Must read

 తెలంగాణ వీణ , జాతీయం : రాజ వంశీకురాలు, రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరా రాజే తన కంచుకోట ఝల్రాపటన్‌ నుంచి మరోసారి ఎన్నికల బరిలో దిగినున్నారు. శనివారం బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో ఆమెకు టికెట్‌ లభించింది. 10మంది మహిళా అభ్యర్థులు సహా 83పేర్లతో పార్టీ ఈ జాబితా వెల్లడించింది. 50మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చింది. 9మందికి నిరాకరించింది. వసుంధరకు తొలి లిస్టులోనే టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆమె అభిమానులు, మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మొదటి జాబితాలో పక్కనపెట్టిన మాజీ ఉప రాష్ట్రపతి భైరాన్‌సింగ్‌ షెకావత్‌ అల్లుడు, ఐదుసార్లు ఎమ్మెల్యే నర్పత్‌సింగ్‌ రజ్వీకీ ఈసారి టికెట్‌ దక్కింది. రజ్వీ ప్రస్తుతం విద్యాధర్‌నగర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈసారి ఛిత్తోర్‌గఢ్‌ టికెట్‌ ఇచ్చింది. తొలుత తనను విస్మరించడంపై రజ్వీ మండిపడ్డారు. శ్రేణుల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాజే, రజ్వీ విషయంలో నిర్ణయాలు బెడిసికొట్టడంతో బీజేపీ నష్ట నివారణకు దిగింది. కాగా, ఇద్దరు మాజీ మంత్రులు సహా రాజే మద్దతుదారులు పలువురికి మలి జాబితాలో టికెట్లు లభించాయి. శాసనసభా పక్షనేత, ఏడుసార్లు ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్‌ను చురు నుంచి కాకుండా తారానగర్‌ నుంచి బీజేపీ బరిలో దింపింది. కాగా 41 మందితో ప్రకటించిన తొలి జాబితాలో బీజేపీ అధిష్ఠానం ఏకంగా ఏడుగురు ఎంపీలకు అసెంబ్లీ టికెట్లిచ్చి ఆశ్చర్యపరిచింది. తాజా జాబితాలో పార్లమెంటు సభ్యులెవరినీ శాసనసభ బరి లో దించలేదు. 200సీట్లున్న రాజస్థాన్‌లో నవంబరు25న పోలింగ్‌ జరగనుంది.

సర్దార్‌పురా నుంచి గెహ్లోత్‌.. టోంక్‌లో పైలట్‌

రాజస్థాన్‌ అధికార పార్టీ కాంగ్రెస్‌ శనివారం 9మంది మహిళలు సహా 33 మందితో తొలి జాబితాను ప్రకటించింది. సీఎం అశోక్‌ గెహ్లోత్‌కు సర్దార్‌పురా, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌కు టోంక్‌ స్థానాలను కేటాయించింది. స్పీకర్‌ సీపీ జోషీకి నద్వారా, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్‌ దోస్తారాకు లక్ష్మణ్‌నగర్‌ టికెట్లు ఇచ్చింది. మూడేళ్ల కిందట పైలట్‌తో కలిసి గెహ్లోత్‌పై తిరుగుబాటు చేసిన ముగ్గురు నాయకులకూ అభ్యర్థిత్వాలు దక్కాయి. 33మంది అభ్యర్థుల్లో ఐదుగురు మంత్రులు సహా 27మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలున్నారు. ఇక మధ్యప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి 92పేర్లతో బీజేపీ శనివారం ఐదో జాబితా విడుదల చేసిం ది. 12 మంది మహిళలకు టికెట్లిచ్చింది. పలువురు సిటింగ్‌లకు టికెట్‌ నిరాకరించింది. వీరిలో పార్టీ కీలకనేత కైలాష్‌ విజయవర్గీయ కుమారుడు, ఇండోర్‌-3 సిటింగ్‌ ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయవర్గీయ ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you