Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కాంగ్రెస్​కు చాన్స్​..?లోక్​పోల్​ సర్వే వెల్లడి..

Must read

తెలంగాణ వీణ, ఎడిటోరియల్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు లోక్​పోల్​ సర్వే సంస్థ తాజాగా ఓ సర్వే నివేదికను విడుదల చేసింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్వే సంస్థలు దూకుడు పెంచాయి. చాలా సర్వేల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా లోక్ పోల్ సర్వేలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఈ సర్వేలో అధికార పార్టీ బీఆర్ఎస్‌కు షాక్ తగిలినట్లుగా మారింది. లోక్ పాల్ చేపట్టిన సర్వేలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వైపు అధిక శాతం మంది మొగ్గు చూపుతున్నట్లు తేలింది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీఆర్​ఎస్​ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, ఇతర పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించడంతో పాటుగా మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం లోక్​పోల్ చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్ ఈ సారి బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 వరాలను ప్రకటించింది. ప్రస్తుతం అభ్యర్థులను ప్రకటించే పనిలో పడింది. బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికలో ఉంది. ఓ వైపు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంటే మరో వైపు రాష్ట్రంలో ఎలక్షన్స్ సర్వేలో జోరందుకున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా లోక్ పోల్ సర్వే చేయగా అందులో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ 45 నుంచి -51 స్థానాలు, కాంగ్రెస్ 61 నుంచి -67 స్థానాలు, ఎఐఎంఐఎం 6 నుంచి -8, బీజేపీ 2 నుంచి -3, ఇతరులకు 0-1 సీట్లు రావొచ్చని ఆ సర్వే వెల్లడించింది. అలాగే ఓటింగ్ శాతం కూడా బీఆర్ఎస్ 39 నుంచి -42%, కాంగ్రెస్ 41 నుంచి -44% , ఎంఐఎం 3- నుంచి 4%, బీజేపీ 10 నుంచి -12%, ఇతరులు 3 నుంచి -5% రావొచ్చని సర్వే అంచనా వేసింది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్​ 30 వరకు ఈ సర్వే చేసినట్లుగా ప్రకటించారు. అప్పటికే బీఆర్​ఎస్​ అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్​లకు టికెట్లు ఇవ్వడంతో.. వ్యతిరేకత పెరిగిందని భావిస్తున్నారు. ఈ లెక్కన రెండు సార్లు బీఆర్ఎస్‌ను గెలిపించిన ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని చూస్తున్నట్లు సర్వే చెబుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియాకు కృతజ్ఞతగా ఒక్క ఛాన్స్ వారికి ఇవ్వాలనే ధోరణిలో తెలంగాణ ప్రజలు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడుగా బీఆర్ఎస్ కీలక నేతలంతా ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతుండటం, కొన్ని సెగ్మెంట్లలో రెబెల్స్​ బరిలో ఉండటంతో కాంగ్రెస్​కు కలిసి వస్తుందని లోక్​పోల్​ సర్వే వెల్లడించింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you