Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

17 రోజులు 42 సభలు

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్‌ఎస్‌, ఇక అసలు సిసలైన పోరాటం మొదలుపెట్టనున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా రణ గర్జన వినిపించబోతున్నది. అభివృద్ధే అస్త్రాలుగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టనున్నారు. కేసీఆర్‌ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్స్‌ అందజేసిన రోజు నుంచే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు.

స్వరాష్ట్రంలో జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రచార పర్వాన్ని హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రారంభించినట్టే ఈ సారీ అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. తొలి విడతగా 17 రోజుల్లో 42 నియోజకవర్గాలను చుట్టే బాధ్యతను కేసీఆర్‌ నెత్తికెత్తుకున్నారు. 17 రోజుల షెడ్యూల్‌లో నవంబర్‌ 9న రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలుచేసి సభల్లో పాల్గొంటారు. 15వ తేదీన హుస్నాబాద్‌ సభతో ప్రచారం జోరు మొదలు కానున్నది. 15 నుంచి 18వ తేదీ వరకు 5 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తారు. దసరా పండుగ తర్వాత 26 నుంచి తిరిగి ప్రచారం ప్రారంభిస్తారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you