Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

‘స్కిల్‌’ విచారణ సీబీఐకి!

Must read

 తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ , కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఐడీలతో పాటు స్కిల్‌ కుంభకోణంలో కీలక నిందితులైన మాజీ సీఎం చంద్రబాబు, అచ్చె­న్నా­యుడు, అప్పటి అధికారులు గంటా సు­బ్బా­రావు, డాక్టర్‌ కె.లక్ష్మీ­నారా­యణ, నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్‌ ఎండీ వికాస్‌ వినయ్‌ కన్వీల్కర్, సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్‌ బోస్, సంజయ్‌ డాగా, ఐఏఎస్‌ అధి­కారిణి అపర్ణ ఉపాధ్యాయ సహా 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూ­ర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద­రావు, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you